సదా నా మదిని నువ్వే నిండి వుండవా దేవా

సదా నా మదిని నువ్వే నిండి వుండవా దేవా
ఓం నమో నారాయణాయ..

Sunday, November 13, 2011

ఏ పుర చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం

రోజు సాక్షి ఆదివారం అనుబంధం లో కధ "ఆగ్రాలో టాంగా" చాలా బావుంది... నాణానికి రెండో వైపులా తాజ్ మహల్ కి రెండో కోణాన్ని చాలా అద్భుతంగా రాసారు.. చివరికి తాజ్ మహల్ చూడ కుండానే వెనుదిరిగి వెళ్లి పోవడం చాలా బాగుంది.. పైగా చూడ లేదనే అసంతృప్తి తో కాక సిసలైన భారత దేశాన్ని చూసాను అని చెప్పడం చాలా బావుంది.. నిజానికి అనుభవం నాకు చాలా సార్లు జరిగింది..
మొన్నామధ్య
మేము అమృతసర్ వెళ్ళాం.. గోల్డెన్ టెంపుల్ చూడాలని ఎంతో వ్యయ ప్రయాసలు పడి వెళ్ళాం..కాని గోల్డెన్ టెంపుల్ లోని ప్రశాంతత, సిక్కుల భక్తీ మనసుకి ఉల్లాసాన్ని కలిగించినా పట్టణం లోని అపరిశుభ్ర పరిసరాలు, పొంగి పొర్లుతున్న మురికి నీరు, గతుకుల రోడ్లు..మనం తినలేని గట్టి చపాతీలు ...ఎప్పుడెప్పుడు మన వూరు చేరతామా అని ప్రాణం వుగ్గపెట్టుకుని వచ్చాం ...
ఇండియా లో ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి.. కలకత్తా అయినా, హైదరాబాద్ అయినా, ముంబై అయినా, అటు మద్రాస్ అయినా, ఎక్కడ చూసినా ఏమున్నది గర్వకారణం.... ప్రతి పట్టణం లోను మురికి వాడలు, నిరు పేదల జీవితాలు... స్టేషన్ నుండి రైలు బయటకు వచ్చినా పట్టాలకు ఆనుకునే వుంటాయి.. చెత్త దిబ్బలు వాటి మధ్యలో పూరి గుడిసెలు.. బడుగుల్లోంచి వచ్చిన నాయకులు అంతా ఏం చేస్తున్నారు.. సామాజిక న్యాయం అంటూ గొంతు చించుకునే నాయకులకు ఇవేమీ పట్టవా.. (..) చెందిన వారమంటూ ఓట్ల లోను, ఉన్నత ఉద్యోగాలలోనూ సీట్లను పొందుతున్నా స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళయినా... వీరి తల రాతలు మారలేదేమి....

0 comments:

Post a Comment